టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లు రసవత్తరంగా జరిగాయి. ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో సగటు అభిమాని నూటికి నూరుశాతం వినోదం అందుకున్నాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో కూడా కివీస్, టీమిండియా మధ్య హోరాహోరీ పోరు సాగి చివరికి టీమిండియానే గెలిచింది. 5 టీ ట్వంటీల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి…కివీస్ ను దిమ్మతిరిగే దెబ్బా కోట్టింది. దీంతో కివీస్ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్ను క్వీన్స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బ్యాటింగ్లో సీఫెర్ట్(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), రాస్ టేలర్(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా బ్యాటింగ్ చేసినా మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు.