లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మొదటిసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. గ్యాప్ వచ్చినా తన నటనలో ఏమాత్రం మార్పు రాలేదని అదే ఆక్టివ్ నెస్ తో ముందుకు వెళ్తుందని అందరు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో ఆఫర్స్ ఆమెను వెత్తుకుంటూ వస్తున్నాయి. దీనికి ఆమె ఎలాంటి జవాబు ఇచ్చిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ట్విట్టర్ వేదికగా “సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా నట ప్రస్థానానికి 1979 కళ్లుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుండి నేటి వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు” అని ట్వీట్ చేసింది. ఇది గమనిస్తే ఆమె ఇంక సినిమాల్లో నటించే ఛాన్స్ లేదేమో అని అనిపిస్తుంది.