Home / ANDHRAPRADESH / బాలయ్య వార్నింగ్‌‌కు వైసీపీ నేత ఇక్బాల్ అదిరిపోయే పంచ్..!

బాలయ్య వార్నింగ్‌‌కు వైసీపీ నేత ఇక్బాల్ అదిరిపోయే పంచ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటీ..నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు.

 

అయితే బాలయ్య వార్నింగ్‌‌కు హిందూపురం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఇక్బాల్ మాట్లాడుతూ….సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం బాలయ్య మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమాలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ఇక్బాల్ మండిపడ్డారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. హిందూపురానికి తాగునీరు తెచ్చే అమృత్‌ పథకంలో తెలుగు దొంగల అవినీతి త్వరలో బయట పడుతుందని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ హెచ్చరించారు. మొత్తంగా కనుసైగ చేస్తే సుమోలు లేవడానికి ఇది సిన్మాకాదు బాలయ్య అంటూ వైసీపీ నేత ఇక్బాల్ వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat