ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలింది. కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ కూడా తమదంటే తమదే అధికారమని ప్రచారం చేసుకుంటున్నాయి.
అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో టైమ్స్ నౌ పోల్ లో నిర్వహించిన సర్వేలో తేలింది.
మొత్తం డెబ్బై సీట్లలో యాబై రెండు శాతం ఓట్ల షేర్ తో 54-60స్థానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దక్కించుకుంటారు. బీజేపీకి 34% ఓట్లు షేర్ తో 10-14సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 0-2స్థానాలే వస్తాయని తేలడం గమనార్హం. ఆప్ కి గతంతో పోలిస్తే రెండున్నర శాతం ఓట్లు మాత్రమే తగ్గుతాయని టైమ్స్ నౌ పోల్ లో తేలింది.