మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసినందుకు రైతు సంఘాల నేతలు ఢిల్లీలో ఈరోజు ఎంపీలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన విజయసాయి రెడ్డి రైతు సంక్షేమమే మా లక్ష్యం. అదే మా విధానం కూడా అని అన్నారు.