ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు.
కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వారి నుండి సేకరించిన శాంపిల్స్ ను టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.ఈ పరీక్షల్లో వారికి కరోనా వైరస్ సోకలేదు అని తేలిందని అన్నారు.
మరోవైపు శ్రీకాకుళంలో ఇరవై ఒక్కరోజుల ముందు చైనా నుండి వచ్చిన ఒక యువకుడికి కరోనా వైరస్ సోకిందని వార్తలు ప్రచారం జరిగాయి. అయితే ఆ యువకుడ్ని పరీక్షించగా అందులో నిజంలేదు అని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు అని వాళ్ళు తేల్చి చెప్పారు.