భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మర్చిపోలేనిది అని చెప్పాలి. అందులో ప్రత్యేకించి ఇది అనీల్ కుంబ్లే కి సొంతమని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 21 ఏళ్లకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ఈ బౌలర్ అద్భుతం సృష్టించాడు. ఇది కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే 1999 జనవరిలో పాకిస్తాన్ ఇండియా టూర్ కు వచ్చింది. అందులో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఇక మూడో మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఇక ఫెబ్రవరి 4న ఢిల్లీ లో మ్యాచ్ ప్రారంభం కాగా మొదట బ్యాట్టింగ్ చేసిన భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) తీయడంతో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 339 పరుగులు చేయగా పాక్ కు 420 పరుగుల లక్ష్యాన్ని ముందు పెట్టింది. చేజింగ్ కి వచ్చిన పాక్ ఓపెనర్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అప్పుడే వచ్చిన కుంబ్లే అఫ్రిదితో మొదలుపెట్టి చివరి వరకు బౌలింగ్ తో తుడిచేసాడు. దాంతో భారత్ 212 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది.