దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు శనివారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆప్ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్ర్తధాన పోటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ ఆప్ దే మళ్లీ ఢిల్లీ పీఠమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి మొదలైన పోలింగ్ కు బీజేపీకి చెందిన ఎంపీలు సరికొత్త అవతారమెత్తారు.పోలింగ్ సమయంలో ఎవరైన పార్టీ కార్యకర్తలు కానీ స్థానిక నేతలు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ మరి విచిత్రం ఏంటంటే బీజేపీ ఎంపీలను పోలింగ్ ఏజెంట్లుగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది.
ప్రస్తుతం దీనిపై నెటిజన్లు పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ఏజెంట్లను పెట్టుకునేందుకు కార్యకర్తలు కూడా లేరా.. వాళ్ల ఓటమిని వాళ్లే ఒప్పేసుకున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.