Home / NATIONAL / ఏజెంట్లుగా మారిన బీజేపీ ఎంపీలు

ఏజెంట్లుగా మారిన బీజేపీ ఎంపీలు

దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు శనివారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆప్ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్ర్తధాన పోటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ ఆప్ దే మళ్లీ ఢిల్లీ పీఠమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి మొదలైన పోలింగ్ కు బీజేపీకి చెందిన ఎంపీలు సరికొత్త అవతారమెత్తారు.పోలింగ్ సమయంలో ఎవరైన పార్టీ కార్యకర్తలు కానీ స్థానిక నేతలు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ మరి విచిత్రం ఏంటంటే బీజేపీ ఎంపీలను పోలింగ్ ఏజెంట్లుగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది.

ప్రస్తుతం దీనిపై నెటిజన్లు పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ఏజెంట్లను పెట్టుకునేందుకు కార్యకర్తలు కూడా లేరా.. వాళ్ల ఓటమిని వాళ్లే ఒప్పేసుకున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat