న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆనందం కొన్నిరోజులైన అవ్వకముందే టీమిండియాకు ఎదురదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ మంగళవారం జరిగిన చివరి వన్డేలో కూడా ఓడిపోయింది. తద్వారా సిరీస్ 3-0 తేడాతో కివీస్ భారత్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సిరీస్ వైట్ వాష్ అవ్వడంతో 31ఏళ్ల చెత్త రికార్డు ఈరోజు బ్రేక్ అయ్యిందని చెప్పాలి. అదేమిటంటే 1989లో వెస్టిండీస్ తో వైట్ వాష్ అయిన భారత్ మళ్ళీ ఇప్పుడే న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.