తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే.
అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.