తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. వీరికి నెలకు రూ.42వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్,జీఎన్ఎం పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నమోదు చేసుకున్నవారు స్టాప్ నర్సు పోస్టులకు అర్హులు. వీరికి నెలకు రూ.21వేలు వేతనం ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల పదమూడో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు సెల్ఫ్ అటెస్టేషన్తో కూడిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతపరిచి దరఖాస్తు ఫారాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో, ఫిల్లర్ నంబర్ 294, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే, మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రగనర్, రంగారెడ్డి జిల్లా చిరునామాకు పోస్టు ద్వారా గానీ వ్యక్తిగతంగా అందజేయాలి. ఈ నోటిఫికేషన్ వివరాలను http://www.rangareddy.telangana.gov.inనుంచి పొందవచ్చు.