Home / MOVIES / ప్రేమికుల రోజు రష్మిక ఎవరితో ఎక్కడికి వెళ్లిందో తెలుసా

ప్రేమికుల రోజు రష్మిక ఎవరితో ఎక్కడికి వెళ్లిందో తెలుసా

హీరోయిన్‌ రష్మిక మందన్న వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్‌, సాండిల్‌వుడ్‌లో బిజీ హిరోయిన్‌గా మారారు. ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ కొట్టడంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా మారారు. అదే విధంగా స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలోనూ రష్మికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక తాజాగా హీరో నితిన్‌తో కలిసి నటించిన ‘భీష్మ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక అసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘‘ప్రేమికుల రోజు ఉదయమే జిమ్‌కి వెళ్లొచ్చా …. వాలంటైన్‌ డే అంత బోరింగ్‌! రాత్రి నా ఫ్రెండ్‌, డిజైనర్‌ శ్రావ్య వర్మతో డిన్నర్‌కి వెళ్లా. మేం ఇద్దరం సింగిల్‌గా ఉన్నంతవరకూ కలిసి డిన్నర్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. గతేడాదీ ప్రేమికుల రోజున తనతో డిన్నర్‌కి వెళ్లా. ఈ ఏడాదీ వెళ్లా. వచ్చే కొన్నేళ్ల వరకూ… కనీసం తనకు పెళ్లయ్యేవరకూ తనతో కలిసి డిన్నర్‌కి వెళ్తా.’’ అని చెప్పింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat