40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. దీనికి సపోర్ట్ గా పచ్చ మీడియా ఏవేవో రాతలు రాసేది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది”. అని అన్నారు.
Home / ANDHRAPRADESH / చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
Tags ap Chandrababu comments jagan politics tdp Twitter ysrcp