వెల్లింగ్టన్ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు.
ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు.
నేపియర్ వేదికగా 1990లో జరిగిన రెండో టెస్టులో ఓపెనర్ గా వచ్చిన మనోజ్ ప్రభాకర్ మొదటిసారి తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేశాడు. దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత మయాంక్ అదే ఘనతను సాధించాడు. వీరిద్దరు తప్పా ఏ భారత ఓపెనర్ కూడా కివీస్ గడ్డపై టెస్టులో తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయలేదు.