రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. తనపై విమర్శలను చేస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను తిట్టించడానికి కులం కార్డునే ప్రయోగిస్తాడు. ప్రత్యర్థులు ఏ కులం చెందిన వారో చూసి..అదే కులానికి చెందిన నాయకులచే ఎదురుదాడి చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విషయం చాలామార్లు రుజువైంది..అంతే కాదు..తానుకాని…తన పార్టీ వాళ్లు ఏదైనా అవినీతి స్కామ్లో ఇరుక్కుంటే..ఇదిగో మాపై దాడి కాదు మా కులాలపై దాడి అంటూ రెచ్చగొట్టడంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేడు. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే..మన బతుకులు ఆగమైపోయాయంటూ..తన సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి రాజధాని గ్రామాల రైతులతో ఆందోళనలు చేయిస్తున్న ఘనుడు..చంద్రబాబు. గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల్లో 80 శాతం బాబుగారి కులానికి చెందినవారే కావడం గమనార్హం.
తాజాగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈఎస్ఐ కుంభకోణంలో తనకు అత్యంత సన్నిహితుడైన మాజీమంత్రి అచ్చెంనాయుడు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బాబుగారు మళ్లీ కులంకార్డు ప్రయోగిస్తున్నాడు. ఇది బీసీ నాయకులను అణిచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ బీసీలను రెచ్చగొడుతున్నాడు. ఈ మేరకు ఇది ఏపీలోని బలహీనవర్గాలందరిపై జరిగిన దాడి అంటూ కొల్లు రవీంద్రలాంటి బీసీ నేతలతో ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నాడు. అయితే చంద్రబాబు కుల రాజకీయాలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఈఎస్ఐలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా.. ఇదేం న్యాయమని మంత్రి అనిల్ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్న అనిల్…అవినీతికి పాల్పడితే అదేమిటని ప్రశ్నిస్తే బీసీల పేరు చెప్తున్నారని నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలను చీదరించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బీసీలు గుర్తుకువచ్చారా అంటూ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని బీసీ కులాల నిధులు వేల కోట్లు కొట్టేసినప్పుడు బీసీలు గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు. తాము కూడా బీసీలమే అని, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో తనలాంటి బీసీలకు చాలా మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారని చెప్పారు. మొత్తంగా ఈఎస్ఐ స్కామ్లో అచ్చెంనాయుడు దొరికిపోతే…కులరాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తీరును మంత్రి అనిల్కుమార్ తీవ్రంగా ఎండగట్టారు.