ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త హింసాత్మకంగా మారాయి.
దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్మీని దించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని ఆయన సూచించారు.