ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఇరవై తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి జరగనున్న ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒకటి స్థానాలను దక్కించుకున్న ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి ఈ నాలుగు స్థానాలు దక్కడం ఖాయం అన్పిస్తుంది.
ఈ క్రమంలో పెద్దల సభకు ఈ పార్టీలో పోటి ఎక్కువగానే ఉంది. మొదటి నుండి పార్టీకోసం పనిచేస్తోన్న నేతలకు రాజ్యసభ ఇవ్వాలని వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నిన్న మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో జగన్ మంతనాలు జరిపారు అని సమాచారం.
అందులో భాగంగా అభ్యర్థుల జాబితాలో ముందు వరుసలో ‘రాంకీ’ అయోధ్యరామిరెడ్డి పేరున్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీని వీడి వైసీపీకి వచ్చే సమయంలోనే.. నెల్లూరు నేత బీద మస్తాన్రావుకు రాజ్యసభ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో..!…