Home / ANDHRAPRADESH / చంద్రబాబు సభలో ఒక కార్యకర్త లక్ష లంచం ఇచ్చానని చెప్పిన వీడియో వైరల్

చంద్రబాబు సభలో ఒక కార్యకర్త లక్ష లంచం ఇచ్చానని చెప్పిన వీడియో వైరల్

టీడీపీ ప్రభుత్వంలోనే రూ. లక్ష లంచం ఇచ్చాం అని ప్రతిపక్షనే చంద్రబాబు నాయుడు సభలో ఒక కార్యకర్త చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజిలాపురం కూడలిలో ప్రసంగించిన చంద్రబాబుకు టీడీపీ కార్యకర్త ఈ విషయం చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో భాగంగా మైక్‌ ఇచ్చి మాట్లాడమని చంద్రబాబు స్థానికులకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో వెంకటాచలం అనే రైతు మాట్లాడుతూ.. తన భూమి వివరాలను ఆన్‌లైన్‌లోకి ఎక్కించడానికి లక్ష రూపాయలు లంచం ఇచ్చానని చెప్పాడు. చూశారా తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు అంటూ మాట్లాడడానికి యత్నిస్తుండగా, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సార్‌ అని వెంకటాచలం చెప్పాడు. దీంతో చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీ నాయకులు షాక్‌కు గురయ్యారు. వెంటనే చంద్రబాబు కలగజేసుకొని అప్పుడు నాకు చెప్పాల్సింది అంటూ సలహా ఇచ్చారు.కొందరు అదికారులు దొంగలు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వెంటనే టీడీపీ నేతలు రైతు మైక్‌ను లాగేసుకున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు రెండు ఎకరాల పదహైదు సెంట్ల భూమిని ఆన్లైన్లో ఎక్కించడానికి ఒక లక్ష రూపాయలు లంచం ఇచ్చానని ఈ రోజు కుప్పం లో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు కి మొరపెట్టుకున్న టీడీపీ నిస్వార్థ కార్యకర్త.

Publiée par Viswanath Reddy sur Mardi 25 février 2020

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat