విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబుపై వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెందుర్తి మండలం, పినగాడి గ్రామంలో ల్యాండ్పూలింగ్తో ఓ తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగింది…వారిని పరామార్శించే నెపంతో చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో గత రెండున్నర నెలలుగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్న చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడ్డారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ బాబు కాన్వాయ్ను అడ్డుకున్నారు.దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పులివెందుల గూండాలు, పెయిడ్ ఆర్టిస్టులంటూ నిరసనకారులపై విరుచుకుపడ్డారు.
అయితే గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు, టీడీపీ నేతలు స్పాన్సర్స్ అన్నది బహిరంగ రహస్యం..అమరావతి రైతుల్లో దాదాపు 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే..మిగిలిన 20 శాతం రోజువారీ కూలీ కింద ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు జోలెపట్టి బిచ్చమెత్తి, ఎన్ని డ్రామాలు ఆడినా అమరావతి ఉద్యమం ఐదారు గ్రామాలకే పరిమితమైంది. దీంతో అసహనంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, పిన్నెల్లి, రోజా, ఎంపీ నందిగం సురేష్లపై రెండుసార్లు జరిగిన దాడుల్లో నిందితులు టీడీపీ కార్యకర్తలే అనడంలో సందేహం లేదు. పిన్నెళ్లి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసి ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నించారు. ఇక నందిగం సురేష్ను కులం పేరుతో దూషిస్తూ…కళ్లలో కారం కొట్టి మరీ ఆయనపై దాడి చేయడానికి కుట్ర చేశారు. అసలు అమరావతి గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలెవరు అడుగుపెట్టకూడదన్నట్లుగా అరాచకం చేస్తున్నారు.
కాగా అమరావతిలో ఆందోళనలు చేస్తుంది నిజమైన రైతులు కాదని…టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ నేతలు ఆరోపిస్తే…రైతులనే అవమానిస్తారా అంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు విశాఖలో చంద్రబాబును అడ్డుకుంటే మాత్రం పులివెందుల గూండాలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అని ఆరోపిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించడం టీడీపీ నేతలకే చెల్లింది. నాపై టమాటాలు, చెప్పులు, గుడ్లతో దాడి చేయించడానికి డబ్బులిచ్చి మనుషులను తెచ్చారని స్వయంగా చంద్రబాబే గగ్గోలు పెట్టాడు… అమరావతిలో వైసీపీ నేతలపై దాడులు చేస్తే ఆందోళనలో భాగం అంట…చంద్రబాబును అడ్డుకుంటే మాత్రం విద్రోహం అంటూ ఎల్లోమీడియా కథలు వడ్డిస్తోంది…అమరావతి రైతుల ఆందోళనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే తప్పు లేదంట..విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజల ఆందోళనల్లో వైసీపీ నేతలు పాల్గొంటే మాత్రం తప్పంటా..చూశారుగా టీడీపీ, ఎల్లోమీడియా తీరు ఎలా ఉందో ..మొత్తంగా అమరావతిలో అయితే ఉద్యమకారులు..విశాఖలో అయితే పెయిడ్ ఆర్టిస్టులు..అంటూ టీడీపీ నీచరాజకీయం చేస్తోంది. ఇదే అసలు సిసలైన పచ్చ సిద్ధాంతం.