దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు తీస్తుంది. ఘటన జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ షూటింగ్ కి సంబంధించి పోలిసులు దగ్గర పర్మిషన్లు తీసుకోవడమే కాకుండా అతడికి కావాల్సిన వివరాలు అన్ని తెలుసుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన అందరిదగ్గర వివరాలు సేకరించారు.