Home / ANDHRAPRADESH / మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?

మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?

టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ తనదైన స్టైల్లో నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారు. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా దుగ్గిరాలలోని తన ఇంటి నుండి ఏలూరు వరకు గుర్రం బండిపై స్వారీ చేస్తూ హల్‌చల్ చేశాడు. తాజాగా కోడిపందాలు, జూదం అంటే చెవి కోసుకునే చింతమనేని ప్రభాకర్ అర్థరాత్రి పూట మడిచర్ల గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన అనుచరులతో కలిసి కోడిపందేలు ఆడుతూ నానా రభస చేశాడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు జరుగుతున్న ప్రాంతంపై అకస్మాత్తుగా దాడి చేశారు. పోలీసులను చూసి చింతమనేని అక్కడనుంచి పరారీ అయినట్లు సమాచారం. కోడిపందాలు ఆడుతున్నచింతమనేని అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకు సంబంధించిన కార్లను సీజ్ చేశారు. కాగా ఇవాళ చింతమనేని ప్రభాకర్ ఛలో అమరావతికి పిలుపునిచ్చాడు. తన అనుచరులు, తన సామాజికవర్గానికి చెందిన రైతులతో కలిసి 200 కార్లతో పోలీసులు కళ్లుగప్పి అమరావతికి బయలుదేరాడు. దీంతో పోలీసులు చింతమనేనిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కోడిపందేలు ఆడుతూ అర్థరాత్రి పూట పోలీసులను చూసి పారిపోయిన చింతమనేని వ్యవహారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat