Home / SLIDER / కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల.

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల.

కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం జరిగిందని దాంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో భరోసా కలగనిదే వారిలో ఆందోళనలు తగ్గే అవకాశం లేదు, అందుకనే కరోనా వైరస్ పట్ల ఒక పక్క వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటునే మరోపక్క కరోనా వైరస్ సోకితే అందించాల్సిన చికిత్స పట్ల తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సలహాలు, సూచనలతో పూర్తిస్థాయిలో చేయగలిగామని ఈటల అన్నారు.ఈ క్రమంలో ప్రతిరోజు పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు.
24 గంటలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి సిబ్బంది వరకు పని చేశారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈటల రాజేందర్. మీడియా కూడా సంయమనంతో ప్రజలను చైతన్య పరిచేందుకు వార్తలు ప్రచురించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇంత చెప్తున్నా మాస్కుల కోసం ప్రజలు పడుతున్న అతృత, కరుణ వైరస్ పై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం తో ఇంకా ప్రజల్లో ఆందోళన ఉంది.. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదైన 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరకు మంత్రి స్వయంగా వెళ్లారు ..ఆయనతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందించి పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను, భయాలను తొలగించడానికి గాంధీలో పర్యటిస్తున్నట్లు ఈటల తెలిపారు. పాజిటివ్ వ్యక్తి తో పాటు కరోనా వైరుస్
అనుమానం తో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి వార్డులో ఉన్న వారితో కూడా మంత్రి స్వయంగా మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఏర్పాట్లపై చర్చించారు.

కరోనా వైరస్ పేషెంట్ల వద్ద ఉన్నప్పుడు మాత్రమే మంత్రి మాస్కులు ధరించి వెళ్లారు. హాస్పిటల్ లో పలువురు పేషెంట్ నేరుగా కలుసుకొని ట్రీట్మెంట్ పొందుతున్న విధానంపై చర్చించారు. అక్కడ ఎక్కడ కూడా మాస్కులు ధరించి కుండా పేషెంట్ల తో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల డ్రాప్ లెట్స్ ద్వారా మాత్రమే మరొకరికి వైరస్ సోకుతుంది తప్ప గాంధీ హాస్పిటల్ లో ఉన్న అందరికీ వైరస్ వల్ల ప్రమాదం ఉండే అవకాశమే లేదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. వేరు వేరు వార్డులో ఉన్న పేషంట్ ని అడిగి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.గాంధీ ఆసుపత్రి లో ఉన్న 7 ఫ్లోర్ లు కలియతిరిగారు. ఆయన వెంట డైరెక్టర్ ఆఫ్ మెడికల్ health డాక్టర్ రమేష్ రెడ్డి ,డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారు .ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల తో కూడా మంత్రి మాట్లాడారు.. డాక్టర్లుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినబాధ్యత మరచిపోయి, మీరే ఆందోళన చెందటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది తప్ప ఐసొలేషన్ వార్డు ఇక్కడ ఉండటం వల్ల ఏ ఒక్కరికి కరోనా వైరస్ సొకదు అని స్పష్టం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. మంత్రిగా నేనే వచ్చినప్పుడు డాక్టర్ గా మీరు భయపడటం లో అర్థం లేదు అని వారికి నచ్చజెప్పారు.

ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ లో కరోనా వార్డు ల్లో ఏర్పాట్లపై డాక్టర్లతో చర్చించారు. కరోనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు కు వెళ్ళే దారిలో ఏ ఒక్కరిని కూడా అనుమతించవద్దని పూర్తిగా వైరస్ సోకిన వారు రావడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు . లిఫ్ట్ కూడా వైరస్ సోకిన వారిని తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలని, హాస్పిటల్ లో మిగతా పేషెంట్లు ఎవరు కూడా ఈ కరోనా వైరస్ సోకిన వారిని ఉంచే వార్డులకు వెళ్ళడానికి వీలులేకుండా దారులు మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది లిఫ్ట్ లను, వార్డ్ లను ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్ల తో శుభ్రం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఐసోలేషన్ వార్డులో ఉన్నవారు చాలామంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఉండడంతో వారికి వైఫై సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. మీడియా కూడా సంయమనం పాటించాలని వైరస్ సోకిందని అనుమానం ఉన్న వారందరికీ పాజిటివ్ వచ్చే అవకాశం లేదని, ఇప్పటి వరకు ఒకే ఒక్కరు మాత్రమే తెలంగాణలో పాజిటివ్ గా నమోదు అయ్యారని మిగతా వారికి వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని ట్రేస్ చేసి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించి తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడతమని మంత్రి అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతృప్తి వ్యక్తం చేశారని, ప్రజల భయాందోళనలను పోగొట్టడానికి శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను కెసిఆర్ గారు అభినందించారు అని మంత్రి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat