మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. ఇది అందరు అనుకున్న విషయమే అని చెప్పాలి. ఎందుకంటే అసీస్ డిఫెండింగ్ ఛాంపియన్ మరియు అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కూడా. అయితే మరోపక్క టీమిండియా గెలిస్తే బాగుంటుందని భారత్ అభిమానులు అందరు ఆశించారు. ఇక అసలు విషయానికి వస్తే లీగ్ దశలో భారత్ అద్భుతంగా రాణించింది. ఈ అద్భుతానికి కారణం ఓపెనర్ షెఫాలీ వర్మ..తాను రాణించడంతోనే జట్టు ఇంత వరకు వచ్చింది. కాని ఫైనల్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. షెఫాలీ మొదటి ఓవర్ లోనే ఔట్ అయ్యింది. అంతేకాకుండా ఆసీస్ బ్యాట్టింగ్ ఆడుతున్న సమయంలో క్యాచ్ వదిలేసింది. దాంతో ఓటమిని తట్టుకోలేని వర్మ కన్నీరు పెట్టుకుంది. సహచర ప్లేయర్స్ ఆమెను ఓదార్చారు.