ఏపీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసుల మనస్తత్వం మారాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హితవు పలికారు.
ప్రతి ఒక్కరినీ అమ్మా, తల్లీ, చెల్లీ, మీరు అంటూ పలకరిస్తూ… సమస్య ఏమిటో ఓపిగ్గా విని తెలుసుకుని పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆదివారం ఏపీలోని 967 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోలీసు స్టేషన్లంటే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు స్టేషన్కు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్క మహిళపట్ల అగౌవరవంగా మాట్లాడటానికి వీల్లేదని హెచ్చరించారు.