ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు దానికి కూడా వ్యతిరేకత చూపుతున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో మందు, డబ్బు పంపిణీ చెయ్యనీయకుండా ఆపటానికి మీరెవరని టీడీపీ ప్రశ్నిస్తోంది. వీటిని అడ్డుకునే ఆర్డినెన్సు చెల్లదట. కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి సాధిస్తామని సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారు. అడ్రసు గల్లంతయ్యే ముందు ఇలాంటి పిచ్చి ఐడియాలే వస్తాయి” అని ఎద్దేవా చేసారు.