కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్పాండే తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు. 1990 నుంచి ఉన్న విశాలమైన భవనంలో 12 రకాల కార్యాలయాలున్నాయి. కరోనాకు గురికాకుండా ఉండటానికి కర్నాటక ప్రభుత్వం ఈ టెక్ హబ్లోని అన్ని ఐటి, బయోటెక్ సంస్థలకు తమ ఉద్యోగులను ఒక వారం పాటు తమ ఇళ్ల నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించింది.
Tags bengaluru closed Corona Virus Infosys
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023