నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త . త్వరలో 4,76,692 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు.
2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు.
యూపీఎస్సీ ద్వారా 4,399 ఖాళీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 13,995 ఖాళీలు, ఆర్ఆర్బీ ద్వారా 1,16,391 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ మాత్రమే కాదు… రక్షణశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా అదనంగా మరో 3,41,907 పోస్టుల్ని భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు