Home / ANDHRAPRADESH / కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్.. ఇదే వాస్తవం!

కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్.. ఇదే వాస్తవం!

కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో..!

*ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యింది.

*నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడు.

*14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారు. సోషల్ మీడియాలో  వదంతుల్ని నమ్మొద్దు.అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

*విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు ఇస్తున్నాం..!

*అతిక్రమిస్తే ‘ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపిసి సెక్షన్ 188’ ప్రకారం చట్టరీత్యా చర్యలు.

*మాస్కులు , శానిటైజర్ల  కొరత లేదు..  కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం.. నిరంతరం సమీక్షిస్తున్నాం.. ఎవరూ ఆందోళన పడొద్దు  అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి. వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలి.

*వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలి.

*కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 883మంది  ప్రయాణికుల్ని గుర్తించాం. 607మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 254 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. 22 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 109 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 94 మందికి నెగటివ్ వచ్చింది.

*13 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకువ్యాధి లక్షణాలున్నా ,లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలి. బయటికి వెళ్లకూడదు కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి జిల్లాలో బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశాం అని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat