Home / SLIDER / తెలంగాణలో 21కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో 21కి చేరిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇరవై ఒకటికి చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,274నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుండి ఇప్పటివరకు తెలంగాణకు ఇరవై వేలకు పైగా మంది వచ్చారు. పదివేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశాము.

ఏడు వందల మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది.వీరందరికీ పరీక్షలు చేస్తున్నాము. ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అయింది. ఇప్పటి వరకు ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎనిమిది మంది భారతీయులు .. పదమూడు మంది విదేశీయులని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి వలనే సమస్య. విదేశాల నుండి వచ్చేవారికి చేతులేత్తి దండం పెడుతున్నాను.

మీరంతా మా బిడ్డలే. ఈ రాష్ట్రానికి చెందినవారే. మీరంతా స్థానిక వైద్యుల దగ్గర పరీక్షలు చేయించుకోండి. కరోనా లక్షణాలుంటే చికిత్స చేస్తారు. లేకుంటే మీరు దర్జగా ఇంటి దగ్గరే ఉండోచ్చు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు పరీక్షలు చేయించుకోకుండ బయట తిరిగి ఇతరులను ఇబ్బంది పెట్టోద్దని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat