తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అభినందనలు తెలిపారు.
ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్తో అమిత్షా ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్షా ప్రశంసించారు.