తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు.
అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అంతే కాకుండా నిత్యవసర వస్తువులను అందించే షాపులను ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతిస్తున్నాము. ఆరుగంటలు దాటి ఓపెన్ చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.ప్రస్తుత పరిస్థితులను అడ్డుపెట్టుకుని ధరలను పెంచినవాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు..