తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు.
మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం..
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు రాత్రి పూట కర్ఫ్యూ ..పగటి పూట లాక్ డౌన్ విధించాము.దీనిని ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.ప్రజలందరూ ఇందులో పాల్గొనాలి.అందరూ సహాకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.