Home / TELANGANA / రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం..సీఎం కేసీఆర్ హామీ

రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం..సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, విధానాన్ని ఆమోదిస్తామని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ – అమ్మకం – ఎగుమతులు, దీనికి అవలంభించాల్సిన విధానం తదిర అంశాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తదితర కారణాల వల్ల రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దీనివల్ల రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్నది. ఈ సారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ సారి వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంది. ప్రపంచ మంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘తెలంగాణ వ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20-30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్.సి.ఐ.కి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. దీనికోసం ప్రభుత్వ పరంగా రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తాం. తెలంగాణలోని రైసు మిల్లులు రాష్ట్ర ప్రగతిలో బాగస్వామ్యం కావాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చెప్పిన మరికొన్ని విషయాలు
———————————————————
– రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవు. అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా విధానంలో ప్రభుత్వం మార్పులు తెస్తుంది.

– రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనే విషయాలను సరిగ్గా అంచనా వేసి, దానికి అనుగుణంగా ధాన్యం రకాలను పండించాలి. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలి.

– ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసు మిల్లుల్లో పనిచేసే హమాలీలో తమ సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.

– రాష్ట్రంలో రైసు మిల్లుల స్థాపనకు పారిశ్రామిక వాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తాం. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గా గుర్తించి, అసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం.

– రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవి. వాటిని 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచాము. దీన్ని 40 లక్షలకు తీసుకుపోవాలి.

– రైసు మిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందించాలి.

– రాష్ట్రంలో రైసు మిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలి.

– రైస్ మిల్లుల ఎల్.టి. కేటగిరిని 70 హెచ్.పి.ల సామర్థ్యం నుంచి 150 హెచ్.పి.ల సామర్థ్యానికి పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat