ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసులు:-
నెల్లూరు-32
కృష్ణా-23
గుంటూరు-20
కడప-19
ప్రకాశం-17
పశ్చిమ గోదావరి-15
విశాఖపట్నం-14
తూర్పుగోదావరి-09
చిత్తూరు-09
అనంతపురం-02
కర్నూలు – 01 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు.