Home / SLIDER / హమ్ సబ్ హిందూస్థానీ అంటూ మంత్రి హారీష్ భరోసా

హమ్ సబ్ హిందూస్థానీ అంటూ మంత్రి హారీష్ భరోసా

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదు అందజేసిన మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి,
మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు.

– పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.

– జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 10 వేల మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి 500 రూపాయల నగదును అందజేసినట్లు వెల్లడి. మరో 8 వేల మంది వలస కార్మికులకు త్వరలోనే అందిస్తాం.

– లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయామని రంది పడొద్దు. మీరు మా బంధువులేనని, హమ్ సబ్ హిందూస్థానీ అంటూ.. వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మంత్రి వెల్లడి.

– ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే.. ఉచిత భోజన సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నిరభ్యంతరంగా తినొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat