టీమండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాఠాలే కాకుండా వైద్య పాఠాలు కూడా చెప్తున్నాడు.క్రీడల్లో అయ్యే గాయాల గురించి పన్నెండు వేల మంది యువ వైద్యులతో సచిన్ ముచ్చటించాడు.
తనక్రికెట్ కెరీర్ లో ఎన్నో సార్లు గాయపడిన సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా బాధపడ్డాడు.తనకు ఎదురైన గాయాల గురించి ..వాటిని ఎదుర్కున్న తీరుపై వైద్యులకు వివరించాడు.
ప్రస్తుతందేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై వైద్యులు,మెడికల్ నాన్ మెడికల్ సిబ్బంది చేస్తున్న పోరాటంపై ప్రశంసల వర్షం కరిపించారు.తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని సచిన్ అన్నారు.