తెలంగాణ రాష్ట్ర బాటలో దేశంలోని తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు నడవనున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మండలి సమావేశమై రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు.
లాక్ డౌన్ గడవును మే నెల ఏడో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సడలింపులు ఇవ్వద్దు అనే నిర్ణయం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
తాజాగా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి.మే మూడో తారీఖు వరకు ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదు ఉత్తర్వులను జారీ చేశాయి.మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.