తెలంగాణలో గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. గ్రీన్, ఆరెంజ్ జోన్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
భౌతిక దూరాన్ని పాటించకపోతే వెంటనే సడలింపులు రద్దు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మే 15 తర్వాత సమీక్ష చేసిన తర్వాత మరిన్ని సడలింపులు ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు.