రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు.
అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. అందుకు కావాల్సిన రూ. 1200 కోట్లను బుధవారమే విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామన్నారు. చిల్లర రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మొద్దని సూచించారు. మొక్కలు, శనగ, కందులు ప్రభుత్వమే కొంటోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.