Home / TELANGANA / సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు..!!

సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు..!!

సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతర నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజి నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో అటవీ భూమి సేకరించడం అవసరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ భూమిని కేంద్ర అటవీశాఖ బదలాయించింది. దీంతో పాటు బ్యారేజి నిర్మాణానికి అవసరమైన తుది పర్యావరణ అనుమతులు కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat