ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి.
ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది.
ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన సోదరులు, తనయుడు వైసీపీ చేరబోతున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతగా ఉన్న గాదె వెంకట్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది.