తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది.
కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది.
ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే కరెంటు బిల్లు మూడు నెలలకు ఏకంగా ఏడు లక్షలు రావడంతో కరెంటు బిల్లు ఎలా కట్టాలని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.దీనిపై విద్యుత్ అధికారులు స్పందిస్తూ స్లాబుల ప్రకారమే కరెంటు బిల్లులు తీసుకుంటున్నామని తెలిపారు.