భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల నమోదులో ఎప్పటికప్పుడు పాత రికార్డులను చెరిపేస్తూ బెంబేలెత్తిస్తోంది.
తాజాగా దేశంలో 24 గంటల్లో ఏకంగా 15,968 మంది కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దేశవ్యాప్తంగా మరణాల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 465 మంది ప్రాణాలను ఈ వైరస్ బలి తీసుకుంది. ఆది నుంచీ కరోనా ధాటికి వణికిపోతున్న మహారాష్ట్రలో ఒక్కరోజులో 248 మరణాలు సంభవించాయి.
కొత్త కేసుల విషయంలో మహారాష్ట్ర(3,214)ను దిల్లీ(3,947) దాటేసింది. ఇలా జరగడం ఇది రెండోసారి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో మాత్రమే రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
రోజువారీ మొత్తం కేసుల్లో 60% అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్ల్లోనే నమోదవుతున్నాయి. అదే తరహాలో మన దేశంలో రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్ల వాటా 60 శాతానికిపైగా ఉంటోంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం 56.70%కి, మరణాలు 3.17%కి చేరాయి.