తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 వ విడత హరిత హారంలో బాగంగా 22వ డివిజన్ లోని గొల్లవాడ హనుమాన్ గుడి వద్ద మేయర్ గుండా ప్రకాశ్ రావు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు,కమీషనర్ పమేల సత్పతి,పోలీస్ కమీషనర్ రవిందర్,కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..వరంగల్ మహానగర పాలక సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ”మంకీ ఫుడ్ కోర్ట్” ను వారు ప్రారంభించి మొక్కలు నాటారు…
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారమని,గత ఐదేళ్ళుగా విజయవంతంగా హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటామన్నారు..నూతన మున్సిపల్ చట్టంలో ప్రతీ మున్సిపాలిటి బడ్జెట్ లో 10%నిదులు హరితహారంకోసం ఖర్చు చేసే విదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు..ప్రణాళికబద్దంగా ముందుకెలుతూ హరితహారాన్ని విజయవంతం చేద్దాం..అవసరాలకు అనుగుణంగా అవసరమైన మొక్కలు నాటేందుకు రాబోవు నాలుగు సంవత్సరాలకు ముందస్తుగా ప్రణాళిక రూపొందించు అందుకు అనుగుణంగా పనిచేస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది..నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాల్సిన బాద్యత మనపై ఉందన్నారు.. హరితహారాన్ని ఉద్యమంలా కొనసాగిద్దాం..ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరిత హారం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ద,పర్యావరణాన్ని పరిరక్షించినపుడే వర్షాలు సంవృద్దిగా పడి అందరం బాగుంటామని అందరూ మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మరుపల్లి రవి బాగ్యలక్ష్మి,మేడిద రజిత మదుసూదన్,కేడల పద్మ జనార్దన్, కో ఆఫ్శన్ సభ్యురాలు బత్తిని వసుందర,ముఖ్య నాయకులు,అదికారులు పాల్గొన్నారు..