సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు.
– అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్.
– కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య.
– వనజీవి రామయ్య కామెంట్స్*
– అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం.
– సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుంది.
– చెట్టు కన్నతల్లి లాంటింది.
– లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు.. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుంది.
– నీటిలో చేప ఉన్నట్టుగా.. భూమిలో పండ్లు ఉన్నాయి.
– చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలి.
– ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోంది.
– ప్రతి రోజు 50వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుంది. శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలి.
– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్
– ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు సేవ చేసినట్టే.
– మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుంది.
– ఇప్పటికే ఢీల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ లేక కొనుక్కునే పరిస్థితి వచ్చింది.
– ఒక్కరోజు మనిషి పీల్చే గాలి 3 ఆక్సిజన్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ ఖర్చు 700 రూపాయలు, ఈ లెక్కన మూడు సిలిండర్లకు 2100 ఖర్చు అవుతుంది.
– ఈ లెక్కన ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి.
– చెట్లు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాయి.
– వనజీవి రామయ్య గారి జీవితం అందరికి ఆదర్శనీయం. వారు కోటికి పైగా మొక్కలు నాటారు.
– అడవుల్లో మనుషులు వెళ్ల లేని చోట ఉన్న ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే డ్రోన్ వినియోగిస్తున్నాం.
– సీడ్ బాల్స్ లో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.
– తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధామ్యం ఇస్తోంది.
– గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే.. తెరాస ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి చెట్లు పెచుతోంది.