Home / NATIONAL / దేశంలో ఒకే రోజు 6.6లక్షల కరోనా టెస్టులు

దేశంలో ఒకే రోజు 6.6లక్షల కరోనా టెస్టులు

గత 24 గంటల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం 6.6లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ ఒకే రోజు అత్యధిక పరీక్షలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, దేశంలో సోమవారం 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలను అధిగమించిందని ఆరోగ్యశాఖ పేర్కొంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat