Home / SLIDER / వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఓరుగల్లులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్న మంత్రులు.

మంత్రులతోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు శ్రీ బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు *అరూరి రమేష్,* ధర్మారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ & MAUD ప్రెసిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్,రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి జడ్పి చైర్మెన్ సుధీర్ కుమార్, జిల్లాల అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు. వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని , మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కాలని ప్రజలను కోరారు. తాత్కాలిక సాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat