తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది.
తెలంగాణలో గత 24గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ 1,752మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో మొత్తం 84,163 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 295, రంగారెడ్డిలో 186, ఖమ్మంలో 161 కేసులు నమోదు అయ్యాయి.