కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్, జ నరేటర్, ఇన్వర్టర్ దుకాణాలు బంద్ అయ్యాయి.
సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నా రు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డల కేంద్రంతోపాటు జక్కాపూర్, గు ర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,484 చెరువులకు గాను 3 వేలకుపైగా మత్తళ్లు దుం కుతున్నాయన్నారు. ఒక్క చెరువు కట్ట కూడా తెగలేదంటే మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ వల్లనేన అన్నారు.