తెలంగాణలో పోలీసులకు కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్గా నిలిచింది. 1,967 మంది వైరస్ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు.
1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్ తరువాత వరంగల్లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు.
5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, సీనియర్లు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వైరస్ ప్రాణాంతకంగా మారింది.
చనిపోయినవారిలో అధికశాతం ఇలాంటి సమస్యలు ఉన్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం కరోనా పాజిటివ్గా తేలిన పోలీసులకు 17 రోజుల సెలవులు ఇచ్చి డిపార్ట్మెంట్ రూ.5,000 ఆర్థిక సాయం అందజేస్తోంది.